తల్లి సెంటిమెంట్‌తో 'లోఫర్‌': డిసెంబర్ 18న రిలీజ్

శుక్రవారం, 20 నవంబరు 2015 (10:10 IST)
వరుణ్‌ తేజ్‌, దిశాపటాని జంటగా పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో సి. కళ్యాణ్‌ నిర్మించిన చిత్రం 'లోఫర్‌'. డిసెంబర్‌ 18న భారీ ఎత్తున రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. డిసెంబర్‌ 7న ఆడియో వేడుకను భారీ ఎత్తున నిర్వహించనున్నారు.
 
ఇటీవలే 'కంచె' చిత్రంతో మంచి హిట్‌ని కొట్టిన వరుణ్‌కు లోఫర్‌ పెద్ద హిట్‌ అవుతుందని భావిస్తున్నారు. సునీల్‌ కశ్యప్‌ ఈ చిత్రానికి సంగీతం అందించిన సంగతి తెలిసిందే. మదర్‌ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్‌ హిట్‌ అయి వరుణ్‌కు స్టార్‌ హీరోగా గుర్తింపు ఇస్తుందని నమ్ముతోంది చిత్ర యూనిట్‌.

వెబ్దునియా పై చదవండి