రష్మిక మందన్నతో టచ్‌లో హీరో రక్షిత్ శెట్టి

గురువారం, 28 సెప్టెంబరు 2023 (11:27 IST)
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఒకప్పుడు కన్నడ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత విడిపోయారు. అయితే ఇప్పుడు తమ రిలేషన్ ఎలా ఉందో రక్షిత్ రీసెంట్‌గా చెప్పాడు. కన్నడ హీరో రక్షిత్ శెట్టి గతేడాది "777 చార్లీ" సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. 
 
ఈ సినిమా కన్నడతో పాటు తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. రక్షిత్ తెలుగులోనూ పాపులర్ అయ్యాడు. ఈ ఏడాది సప్తసాగర దాచే ఎల్లో (సైడ్-ఎ)తో రక్షిత్ మరోసారి బంపర్ హిట్ కొట్టాడు. ఈ చిత్రం తెలుగులో ‘సప్తసాగరళం’ పేరుతో ఇటీవల విడుదలైంది. 
 
ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ మూవీగా పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగులోనూ మంచి ఆదరణ లభించింది. ఈ సందర్భంగా రక్షిత్ శెట్టి తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన మాజీ ప్రియురాలు రష్మిక మందన్న విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై రక్షిత్ స్పందించాడు.
 
రష్మికతో ఇంకా టచ్‌లోనే ఉన్నానని రక్షిత్ శెట్టి తెలిపారు. ‘‘నేను, రష్మిక మేం మెసేజ్‌లు పంపేవాళ్లం. కానీ రెగ్యులర్ కాదు. నా సినిమా విడుదలైనప్పుడల్లా ఆల్ ది బెస్ట్ విషెస్ అంటూ మెసేజ్ పంపుతుంది. ఆమె సినిమా ఎప్పుడు రిలీజైనా నేను కూడా కోరుకుంటాను. మేము పుట్టినరోజులలో ఒకరికొకరు సందేశాలు పంపుకుంటాము.
 
 
 
రష్మిక, రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ప్రేమాయణం సాగిస్తోందని చాలా కాలంగా రూమర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ చాలా సార్లు కలిసి కనిపించారు. అయితే ఈ విషయంపై ఎన్ని రూమర్స్ వస్తున్నా స్పందన లేదు. విజయ్ - రష్మిక కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు