మహేష్ బాబుతో జోడీ కట్టడం మహాదృష్టం : రకుల్ ప్రీత్ సింగ్

మంగళవారం, 23 ఆగస్టు 2016 (13:10 IST)
టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ తెగ ఉప్పొంగిపోతోంది. ఏదో అదృష్టం తలుపుతట్టినట్టుగా ఫీలైపోతోంది. దీనికి కారణం.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే అవకాశం రావడమే. 
 
ఈ భామ ఇప్పటికే అల్లు అర్జున్.. చరణ్.. ఎన్టీఆర్‌లతో కలిసి నటించింది. తాజాగా మహేశ్ తోను జోడీ కడుతోంది. మురుగదాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ షూటింగ్, హైదరాబాద్‌లో మొదలైంది.
 
దీనిపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. మహేశ్ జోడీ కట్టే ఛాన్స్ రావడం.. ఆయనతో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉందని అంటోంది. కాగా, మహేశ్‌తో తొలిసారిగా నటిస్తోన్న రకుల్ సంతోషంతో పొంగిపోతోంది. 

వెబ్దునియా పై చదవండి