మెగా పవర్ స్టార్‌కు గౌరవ డాక్టరేట్.. ప్రకటించిన చెన్నైలోని ప్రైవేట్ వర్శిటీ!!

వరుణ్

గురువారం, 11 ఏప్రియల్ 2024 (17:31 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ త్వరలోనే గౌరవ డాక్టర్ కానున్నారు. ఆయనకు చెన్నైలోని వేల్స్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. దీన్ని ఈ నెల 13వ తేదీన జరిగే స్నాతకోత్సవంలో ప్రదానం చేయనుంది. కళా రంగానికి రామ్ చరణ్ చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదాన చేస్తున్నట్టు ఆ యూనివర్శిటీ చాన్సరల్ డాక్టర్ ఐసర్ కె.గణేష్ తెలిపినట్టు స్థానిక తమిళ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. 
 
'ఆర్‌ఆర్‌ఆర్‌', 'ఆచార్య' తర్వాత రామ్‌చరణ్‌ నటిస్తోన్న చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌'. సెన్షేనల్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఇది సిద్ధమవుతోంది. అంజలి, ఎస్‌.జె.సూర్య, జయరామ్‌, సునీల్‌, నాజర్‌, శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 
పాన్‌ ఇండియా స్థాయిలో సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే, 'ఉప్పెన' ఫేమ్‌ బుచ్చిబాబుతో చరణ్‌ ఇటీవల కొత్త చిత్రాన్ని అనౌన్స్‌ చేశారు. జాన్వీకపూర్‌ కథానాయిక. దీని తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు