'ఓయ్ రంగమ్మ మంగమ్మా ఏం పిల్లడు'... రంగస్థలం మరో సాంగ్ రిలీజ్ (వీడియో)

గురువారం, 8 మార్చి 2018 (20:53 IST)
సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం "రంగస్థలం". ఈ చిత్రంలో సమంత హీరోయిన్. ఈనెలాఖరులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ చిత్రం ఆడియోలో భాగంగా, ఇప్పటికే రెండు పాటలను విడుదల చేయగా, గురువారం మరో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది 
 
'ఓయ్ రంగమ్మ మంగమ్మా.. ఓయ్ రంగమ్మ మంగమ్మా ఏం పిల్లడు.. పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు..' అంటూ ఈ పాట కొనసాగింది. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటకు దేవీ శ్రీ సంగీతం సమకూర్చగా, ఎంఎం మానస ఆలపించారు. ఈ చిత్రం పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు