అమెరికా ఖుషీ చేస్తోన్న సమంత.. ఫోటోలు వైరల్

సోమవారం, 21 ఆగస్టు 2023 (10:51 IST)
సినీ నటి సమంత అమెరికాకు చికిత్స కోసం వెళ్లింది. అలాగే న్యూయార్క్‌లో మన భారతీయులు నిర్వహించిన ఇండిపెండెన్స్ డే పరేడ్‌లో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన తల్లితో పాటు న్యూయార్క్ వెళ్లిన సమంత... అక్కడ తన స్నేహితులతో కలిసి అందమైన ప్రదేశాల్లో చక్కర్లు కొడుతోంది. 
 
రెస్టారెంట్లతో రుచికరమైన ఆహారపదార్థాలను టేస్ట్ చేస్తోంది. అంతేగాకుండా జిమ్‌లోనూ వర్కౌట్లు చేస్తోంది. ఇకపోతే.. విజయ్ దేవరకొండతో కలిసి ఆమె నటించిన తాజా చిత్రం 'ఖుషి' సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు