మహానటి కష్టాలు నాకు వచ్చి వుండేవి.. తప్పించుకున్నా.. సమంత

గురువారం, 19 మార్చి 2020 (13:05 IST)
''ఏ మాయ చేసావె'' సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన సమంత.. ఆ సినిమాలో కలిసి నటించిన కో-స్టార్ చైతూనే ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగ చైతన్యతో జీవితం సాఫీగా సాగిపోతున్న ఈ తరుణంలో తన మాజీ ప్రియుడు సిద్ధార్ధ్ గురించి ఒక పత్రికలో ప్రస్తావించడం చర్చనీయాంశం అయింది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. మహానటి సావిత్రి జీవితంలో ఏ విధమైన కష్టాలు సంభవించాయో తన జీవితంలో కూడా అలాంటివే చోటుచేసుకున్నాయని చెప్పింది.  
 
అయితే ముందుగానే తాను అలాంటివి పసిగట్టడంతో పరిస్థితి చేయి దాటకముందే జాగ్రత్త పడ్డానని తెలిపింది. కాబట్టే తన జీవితం ఇపుడు సాఫీగా సాగిపోతుందంటూ చెప్పుకొచ్చింది. సిద్ధార్ధ్‌తో వ్యవహారాన్ని ఏమాత్రం నాన్చకూడదనే నిర్ణయానికి అప్పట్లో రావడం తాను జీవితంలో తీసుకున్న అతి పెద్ద ముఖ్య నిర్ణయాల్లో ఒకటి అని ప్రస్తావించింది. 
 
ఇక తన భర్త నాగ చైతన్య గురించి మాట్లాడుతూ.. చైతన్య భగవంతుడు తనకిచ్చిన కానుక అంటూ చెప్పుకొచ్చింది. అందరికీ తన చైతూల అర్ధం చేసుకునే భర్త దొరకాలని ప్రస్తావించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు