బాలకృష్ణ సరసన చెన్నకేశవ రెడ్డి సినిమాలో లీడ్ రోల్ చేసిన శ్రియా చరణ్.. చాలా సంవత్సరాల గ్యాప్కు తర్వాత తిరిగి బాలయ్యతో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. తాజాగా మనం సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రియ.. ఆ తర్వాత ఊపిరి సినిమాలో చిన్న అతిథి పాత్రలో కనిపించింది. డైరెక్టర్ క్రిష్, బాలకృష్ణ, చిత్ర నిర్మాత రాజీవ్ రెడ్డి శ్రియానే ఫైనల్ చేయాలనుకున్నట్లు తెలిసింది.