హమ్మయ్యా... కరోనా రక్కసి నుంచి బయటపడిన బాలీవుడ్ సింగర్

సోమవారం, 6 ఏప్రియల్ 2020 (12:44 IST)
బాలీవుడ్ గాయని కనికా కపూర్ కరోనా రక్కసి నుంచి బయటపడ్డారు. ఆమెకు తాజాగా జరిగిన కరోనా వైరస్ పరీక్షల్లో నెగెటివ్ అని తేలింది. దీంతో ఆమెతో పాటు.. ఆమె కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. 
 
ఇటీవల లండన్ పర్యటనకు వచ్చిన బాలీవుడ్ సింగర్ కరీనా కపూర్‌కు ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. 
 
ఆమెకు మొత్తం ఐదు సార్లు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ ఐదింటిలోనూ ఆమెకు పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆమెతో పాటు.. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 
 
ఈ నేపథ్యంలో ఆమె చికిత్స పొందుతున్న లోక్నోలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో ఆరోసారి కరోనా పరీక్షలు నిర్వహించగా, వీటిలో నెగెటివ్ అని వచ్చింది. దీంతో ఆమె పూర్తిగా కోలుకుందని నిర్ధారించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. 
 
అయితే, కనిక కపూర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ కనిక మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమెపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 
 
విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండాలన్న అధికారుల ఆదేశాలను ఉల్లఘించడం, వైరస్‌ సోకినప్పటికీ నిర్లక్ష్య పూరితంగా పలు సోషల్ ఈవెంట్లకు హాజరవడంతో ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసులు బుక్‌ చేశారు. కాగా, దేశంలో కరోనా సోకిన బాలీవుడ్ తొలి సెలబ్రిటీ కనికా కపూర్ కావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు