పవన్‌, ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. మధ్యలో శ్రీరెడ్డి ఏమి చేసింది?

శుక్రవారం, 30 ఆగస్టు 2019 (18:49 IST)
కాంట్రవర్సీ కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నా, ఆయన అభిమానులు అన్నా ఎగిరెగిరిపడుతుంటుంది. తాజాగా పవన్‌, ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మధ్య చిచ్చుపెట్టింది. ఆమె ఎవరు అనుకుంటున్నారా? ఆమేనండీ శ్రీరెడ్డి. ప్రభాస్ తాజా చిత్రం "సాహో" శుక్రవారం రిలీజైంది. 'సాహో' మూవీని చూసిన కొంతమంది ఫ్లాప్‌ అంటున్నారు. అలా తప్పుడు ప్రచారం చేస్తోంది పవన్ కళ్యాణ్ అభిమానులంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
పీకే ఫ్యాన్స్‌ గొర్రెల్లారా మారరా.. ఏంట్రా మీరు. ప్రభాస్‌ మూవీ మీద పడి ఏడుస్తున్నారు అంటూ ఆమె తాజాగా ట్వీట్ చేసింది. ఎప్పుడూ సంచలన కామెంట్‌లు చేసే శ్రీరెడ్డి ఇప్పుడు తాజాగా 'సాహో' చిత్రం విడుదల సందర్భంగా మరోసారి పీకే ఫ్యాన్స్‌ను టార్గెట్ చేసింది. 
 
వారిని గొర్రెలంటూ తీవ్రమైన కమెంట్ చేసింది. అయితే కొంతమంది పవన్ ఫ్యాన్స్ మాత్రం సినిమా బాగుందని, హాలీవుడ్‌ రేంజ్‌లో ఉంది అని ట్వీట్‌ చేస్తుంటే కనిపించలేదా? అని ప్రశ్నిస్తున్నారు. పవన్ అభిమానులు ఆమె వ్యాఖ్యలకు ఏమి బదులిస్తారో చూడాలి మరి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు