బాలీవుడ్ ప్రేమపక్షులు... నది ఒడ్డున కూర్చుని భుజంపై ఆన్చి..?

బుధవారం, 29 సెప్టెంబరు 2021 (16:47 IST)
Alia Bhatt
బాలీవుడ్ ప్రేమపక్షులు అలియా భట్- రణ్‌బీర్ కపూర్ జోధ్‌‌పూర్‌లో బిజీగా వున్నారు. కారణం రణ్‌బీర్ కపూర్ 39వ జన్మదినోత్సవం. తన గాళ్‌ఫ్రెండ్ అలియా భట్‌తో కలిసి జోధ్‌పూర్ వెళ్లాడు. అక్కడ ఆ జంట తమకు నచ్చిన విధంగా ఎంజాయ్ చేసింది. 
 
అక్కడ సూర్యాస్తమయం సమయంలో తీసుకున్న ఫొటోను ఆలియా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. సూర్యాస్తమయ సమయంలో నది ఒడ్డున కూర్చుని రణ్‌బీర్ భుజంపై తల ఆన్చి తీసుకున్న ఫొటోను ఆలియా అభిమానులతో పంచుకుంది.
 
ఆ ఫొటోను షేర్ చేస్తూ ఆలియా.. "హ్యాపీ హ్యాపీ బర్త్ డే మై లైఫ్" అంటూ కామెంట్ చేసింది. అలాగే మరికొన్ని ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఆ ఫొటోలను అటు రణ్‌బీర్ అభిమానులు, ఇటు ఆలియా అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు