ఈ నేపథ్యంలో అశోక్ ఖేని తాజాగా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. టిప్పు సుల్తాన్ జీవిత చిత్రను వెండితెరపై ఆవిష్కరించాలన్నది రజనీకాంత్ అభీష్టమేనని అశోక్ ఖేని వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని పారిపాలించిన గొప్ప రాజుల్లో టిప్పు సుల్తాన్ ఒకరని, ఆయన హిందూ మతాన్ని గానీ, హిందువులను గానీ ఏనాడూ తక్కువ చేసి చూడలేదని గుర్తు చేశారు.
అంతేకాకుండా, ఈ చిత్రాన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తానని చెప్పారు. అయితే, ఈ చిత్ర స్క్రిప్టు సిద్ధమయ్యేందుకు మరో యేడాది సమయం పడుతుందని అశోక్ ఖేని చెప్పుకొచ్చాడు.