పూరీకి తర్వాత ఛార్మీ.. ఈడీ ఎదుట రేపు హాజరు

బుధవారం, 1 సెప్టెంబరు 2021 (19:32 IST)
టాలీవుడ్‌ను కుదిపేసిన డ్రగ్స్ కేసులో గురువారం నటి ఛార్మీ హాజరు కానున్నారు. ఇప్పటికే చార్మికి ఈడీ నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో నోటీసులు జారీ చేశారు. మనీ లాండరింగ్ కోణంలో చార్మి అకౌంట్స్‌ను పరిశీలించనున్నారు. 
 
కెల్విన్ అకౌంట్లోకి చార్మి పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేసిందా చార్మీ ప్రొడక్షన్ హౌజ్ ఆర్ధిక లావాదేవిలపై ఆరా తీయనున్నారు. ఎంత కాలంగా కెల్విన్‌తో ఛార్మికి పరిచయం డ్రగ్స్ సేవించారా కెల్విన్‌తో పాటు సరపరాకు కూడా సహకరించారా అన్న కోణంలో విచారించనున్నారు. 
 
అసలు ఎన్ని  సార్లు ఛార్మి కెల్విన్ అకౌంట్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ చేసింది. అనేక కోణాల్లో ఆధారాలతో కూడిన విచారణ ఈడీ చేయనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు