ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఒక యేడాది గడిచిపోయిందన్నారు. అయితే, ప్రజల్లో అపుడే వ్యతిరేకత వచ్చిందన్నారు. ప్రజలు మొహం మీదే తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రావడం లేదని, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే బాగుండేదని వారు అంటున్నారన్నారు. పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే ఈ దఫా గెలవడం కష్టమేనన్నారు. పథకాలు రావడం లేదని జనం తిడుతున్నారన్నారు.