ఈ హత్యానంతరం కోస్తా జిల్లాల్లో దాడులు, ప్రతిదాడులు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ దాడుల అనంతరం తిరిగి 28 ఏళ్ళ తర్వాత డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రంగ జీవిత కథ ఆధారంగా ‘వంగవీటి’ అనే సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే, ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏమిటంటే... రంగా హత్యతో అప్పట్లో అనేక లూటీలు, దోపిడీలు, దొమ్మీలు అనేకం జరిగాయి. ఓ పార్టీకి చెందిన నేతల ఆస్తులు, సినిమాహాల్స్ను ధ్వంసం చేశారు. తగులబెట్టారు కూడా.
అలాంటివాటిలో అలంకార్ థియేటర్ ఒకటి. బెజవాడ నగరం నడి బొడ్డున ఈ థియేటర్ ఉంటుంది. "రంగా" అభిమానుల ఆగ్రహానికి ఈ థియేటర్ పూర్తిగా కాలిపోయింది. కొన్ని సంవత్సరాలు పాటు ఈ థియేటర్ స్థానంలో కేవలం మొండి గోడలు మాత్రమే కనిపించాయి. ఆ తర్వాత ఇది సినియా థియేటర్గా మారింది. ఇపుడు ఇదే అలంకార్ థియేటర్లో వంగవీటి సినిమా విడుదల కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో థియేటర్తో పాటు విజయవాడ వ్యాప్తంగా గట్టి బందోబస్తును కల్పించారు.