సరికొత్త కథాంశంతో వస్తున్నానంటున్న వరుణ్ సందేశ్

మంగళవారం, 2 జనవరి 2024 (17:12 IST)
Varun Sandesh pooja
వరుణ్ సందేశ్ హీరోగా ఎమ్ 3 మీడియా, మహా మూవీస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం ఈరోజు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభం అయింది. ఈ సినిమా ద్వారా శ్రీ అద్యాన్త్ హర్ష డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. పూజా కార్యక్రమం అనంతరం ముహూర్తపు షాట్ కి హీరో వరుణ్ సందేశ్ క్లాప్ కొట్టగా, సినిమాటోగ్రాఫర్ అజయ్ కుమార్ మొదటి షాట్ చిత్రీకరించారు.
 
చిత్ర హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ''సరికొత్త కథాంశంతో తీస్తున్న సినిమా ఇది. కథ, కథనాలు చాలా కొత్తగా గా ఉంటాయి. ఇప్పటివరకు నేను నటించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది'' అని ప్రేక్షకులకు అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
 చెప్పారు.
 
దర్శకుడు అద్యాన్త్  హర్ష మాట్లాడుతూ "ఇదొక విభిన్నమైన కథాంశంతో వస్తున్న థ్రిల్లర్ చిత్రం, హీరో లుక్ మరియు అతని క్యారెక్టరైజేషన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి" అని తెలిపారు.
 చిత్ర నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ "డిఫరెంట్ మేకింగ్ అండ్ టేకింగ్ తో ఈ సినిమా ని నిర్మించబోతున్నాం. లొకేషన్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయి.  కధ, కథనం తో పాటు విసుల్స్ కూడా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతినించే చిత్రంగా దీన్ని నిర్మించబోతున్నాం'' అని చెప్పారు. 
 నటీనటులు: వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణా దేవి, కుషాలిని పూలపా, ప్రసాద్ బెహరా తదితరులు ఈ చిత్రంలో ముఖ్య తారాగణం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు