ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు ఇటీవల అనారోగ్యం కారణంగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దాసరిని పరామర్శించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం దాసరిని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పరామర్శించారు.
త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. వారి దీవెనలే ఆయన్ను రక్షించాయి. రెండు, మూడు రోజుల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారు. ఆయన ఆరోగ్యంపై ప్రతిరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ డాక్టర్లను సంప్రదించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు అని చెప్పారు.