హీరో అఖిల్ అక్కినేని సరసన జాన్వీ కపూర్!!

గురువారం, 11 మే 2023 (13:14 IST)
జూనియర్ ఎన్టీఆర్ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుని అందాల నటి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌కు మరో సినిమా అవకాశం లభించింది. అఖిల్ అక్కినేని చిత్రంలో నటించేందుకు ఆమెను ఎంపిక చేసినట్టు సమాచారం. 
 
ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో రూపుదిద్దుకొంటున్న చిత్రంలో జాన్వీ కథానాయికకాగా, ఈ సినిమా ఈ మధ్యే సెట్స్‌పైకి వెళ్లింది. ఈలోగా... ఆమెకు మరో అవకాశం వచ్చిందని టాక్. అఖిల్ తాజా చిత్రంలో జాన్వీని కథానాయిక ఎంచుకొన్నట్టు సమాచారం. ఈ చిత్రానికి అనిల్ దర్శకుడు. 
 
యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం కోసం 'ధీర' అనే పేరును పరిశీలిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా జాన్వీ దాదాపుగా ఫిక్స్ అయ్యిందట. ఆ తరం హీరోయిన్లలో నంబర్ వన్ అనిపించుకొన్న శ్రీదేవి... అటు ఏఎన్నార్‌తోనూ, ఇటు నాగార్జునతోనూ నటించారు. 
 
ఆమె వారసురాలిగా అడుగు పెట్టిన జాన్వీ ఇప్పుడు ఈతరం అక్కినేని హీరోతో కలసి నటిస్తుండడం విశేషం. సోషియో ఫాంటసీగా రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు