సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్కు 'యశ్ చోప్రా' 4వ జాతీయ అవార్డును ఇవ్వనున్నట్లు టి.ఎస్.ఆర్. ఫౌండేషన్ అధ్యక్షులు డా. టి. సుబ్బరామిరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పమేలా చోప్రా (దివంగత యశ్ చోప్రా సతీమణి), పద్మిని కొల్హాపురి, బోనీకపూర్లతో కూడిన సభ్యుల కమిటీ ఈ ఏడాది యశ్చోప్రా 4వ జాతీయ అవార్డుకు గాను సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ను ఎంపిక చేసింది.
యశ్చోప్రా మరణం తరువాత ఆయన పేరిట ఈ జాతీయ అవార్డును డా. టి. సుబ్బరామిరెడ్డి 'టి.ఎస్.ఆర్. ఫౌండేషన్' పేరుపై ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ అవార్డు పేరిట 10 లక్షల రూపాయల నగదు, బంగారు పతాకం, ప్రసంశా పత్రంను అవార్డు గ్రహీతకు అందించనున్నారు. 2017 ఫిబ్రవరి 25న ముంబైలోని హోటల్ మారియట్లో జరిగే వేడుకలో ఈ యశ్చోప్రా' 4వ జాతీయ అవార్డును సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్కు అందించనున్నట్లు డా. టి. సుబ్బరామి రెడ్డి తెలిపారు.
గతంలో ఈ అవార్డును సుప్రసిద్ధ బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్, నటులు అమితాబ్ బచ్చన్, రేఖలు అందుకున్నారు. అమితాబ్ బచ్చన్, రేఖ, శ్రీదేవి, రాణీ ముఖర్జీ, ఐశ్వర్యా రాయ్, జయప్రద, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ మరియు ఇతర సినీ నటులు ఈ అవార్డు వేడుకలో పాల్గొననున్నారు.