ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై 'ప్రేమకావాలి', 'పూలరంగడు' వంటి సూపర్హిట్ చిత్రాన్ని నిర్మించిన కె.అచ్చిరెడ్డి తాజాగా 'ఏమాయ చేసావె' జంట నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా 'వెన్నెల', 'ప్రస్థానం' వంటి ఉత్తమ చిత్రాలను రూపొందించిన దేవా కట్టా దర్శకత్వంలో నిర్మిస్తున్న 'ఆటోనగర్ సూర్య' జనవరి 31న విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ అధినేత కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ - ''ఆటోనగర్ సూర్య' షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ప్రొడక్షన్ వర్క్లో భాగంగా ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 31న వరల్డ్వైడ్గా ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం.
నాగచైతన్య కెరీర్లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అవుతుంది. మా మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్కి ప్రేమకావాలి, పూలరంగడు తర్వాత హ్యాట్రిక్ మూవీ అవుతుంది. కిక్, డాన్శీను, బిజినెస్మేన్, ఢమరుకం వంటి వరస విజయాల తర్వాత ఆర్.ఆర్. మూవీ మేకర్స్ ప్రెస్టీజియస్గా సమర్పిస్తున్న చిత్రమిది. అనూప్ ఎక్స్ట్రార్డినరీ ఆడియో ఇచ్చారు. అలాగే రీ-రికార్డింగ్ కూడా అద్భుతంగా చేస్తున్నారు. ఆల్రెడీ ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో, అభిమానుల్లో హై ఎక్స్పెక్టేషన్స్ వున్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి ధీటుగా సినిమా వచ్చింది. అక్కినేని వంశాభిమానులకు 'ఆటోనగర్ సూర్య' డెఫినెట్గా నచ్చే సినిమా అవుతుంది'' అన్నారు.