బొబ్బిలిసింహం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహ వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాల కథానాయకుడు యువరత్న బాలకృష్ణ హీరోగా రూపుదిద్దుకుంటోన్న భారీ బడ్జెట్ చిత్రం "సింహా".
భద్ర, తులసి వంటి సూపర్హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో, యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తోన్న ఈ సినిమా తొలి షెడ్యూల్ సెప్టెంబర్ 4 నుంచి 19వ తేదీ వరకు రామోజీ ఫిలింసిటీలో జరిగింది.
ఈ షెడ్యూల్ గురించి నిర్మాత పరుచూరి కిరీటి మాట్లాడుతూ.. హీరో బాలకృష్ణ ఇంట్రడక్షన్ ఫైట్ని, బాలకృష్ణ, స్నేహాఉల్లాల్ కాంబినేషన్లో చిత్రీకరించామన్నారు. 21 నుంచి హైదరాహాద్ సిటీలో నవంబర్ చివరి వరకు ఏకధాటిగా ఈ షెడ్యూల్ జరుగుతుందని నిర్మాత వెల్లడించారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బి. మహేంద్రబాబు మాట్లాడుతూ.. డిసెంబర్లో వైజాగ్లో జరిగే షెడ్యూల్తో చిత్రం పూర్తవుతుందని, సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.