సింగర్ శ్రీరామ్ చందర్ హీరోగా నటిస్తున్న చిత్రం 'ప్రేమగీతా జాన్తానై'. శుభం క్రియేషన్స్ పతాకంపై మద్దాల భాస్కర్ నిర్మిస్తున్నారు. సుబ్బు ఆర్వి దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రా సోదరి బాబ్రీ హాండా కథానాయిక. ఈ చిత్రం షూటింగ్ పూర్తయి పోస్ట్ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా దర్శకుడు సుబ్బు మాట్లాడుతూ... దర్శకునిగా తొలి చిత్రమిది. కథకు కొత్తవారు కావాలని శ్రీరామ్ను ఎన్నిక చేశాం. నటుడిగా తన టాలెంట్ను చూపాడు. ఈ నెల 11న శిల్పకళావేదికలో ఆడియో ఫంక్షన్ను చేయనున్నాం. త్వరలో సినిమాను విడుదల చేస్తున్నాం అన్నారు. ఇంకా ఎస్వి రంగారావు, చలపతిరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని సంగీతం: మణిశర్మ.