వీణా మాలిక్, కరణ్ వీర్ బోరా ముఖ్యతారలుగా 'వస్తాడు నా రాజు' ఫేం హేమంత్ మధుకర్ స్వీయదర్శకత్వంలో రూపొందుతోన్న భారీ 3 డి హారర్ చిత్రం 'ముంబై 125 కి.మీ'. సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి ఓ నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సెప్టెంబర్ 26న ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ్ బాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
వీణా మాలిక్, కరణ్ వీర్ బోరా, వెడిత ప్రతాప్ సింగ్, అపర్ణ బాజ్ సాయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత - మణిశర్మ , హేమంత్ మధుకర్, స్టోరీ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - హేమంత్ మధుకర్