అర‌వింద స‌మేత సెన్సార్ రిపోర్ట్ ఏంటి..? సరికొత్త యంగ్ టైగర్‌ను చూస్తారట...

మంగళవారం, 9 అక్టోబరు 2018 (15:45 IST)
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, స్టార్ రైట‌ర్ అండ్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `అర‌వింద స‌మేత‌`. `వీర రాఘ‌వ‌` అనేది ట్యాగ్ లైన్. శ్రీమ‌తి మ‌మ‌త స‌మ‌ర్ప‌ణ‌లో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు) భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ స‌ర్టిఫికేట్‌ను ఇచ్చింది. ఈ భారీ చిత్రాన్ని ఈ నెల‌ 11న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుద‌ల చేస్తున్నారు.
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు) మాట్లాడుతూ - యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌తో మా బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. నంద‌మూరి అభిమానులే కాకుండా, సినీ ప్ర‌ముఖులు కూడా ఈ సినిమా కోసం ఎంతో అతృత‌గా ఎదురుచూస్తున్నార‌నే సంగ‌తి తెలిసిందే. అంద‌రి అంచ‌నాల‌ను మించేలా సినిమా ఉంటుంది. 
 
మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను నిర్మించాం. స‌రికొత్త యంగ్‌టైగ‌ర్‌ను ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ తెరపై ఆవిష్క‌రించారు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, ట్రైల‌ర్‌, ప్రోమోస్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా ఈ సినిమా అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు