'కాళిదాసు', 'కరెంట్' చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సుశాంత్ తాజాగా శ్రీనాగ్ కార్పోరేషన్ పతాకంపై జి.కార్తీక్రెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న భారీ చిత్రం 'అడ్డా'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూలై నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ - ''మా 'అడ్డా'కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలై నెలాఖరులో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటికే ఈ చిత్రం ఆడియో సెన్సేషనల్ హిట్ అయింది.
అనూప్ రూబెన్స్ అందించిన ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఈ చిత్రం ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయబోతున్నాం. ఆడియో సూపర్హిట్ కావడంతో సినిమా మీద మాకు వున్న నమ్మకం రెట్టింపు అయింది. 'అడ్డా' మా బేనర్లో బ్లాక్బస్టర్ హిట్ చిత్రమవుతుందన్న కాన్ఫిడెన్స్తో వున్నాం'' అన్నారు.