'రామబాణం' ఎలా ఉందో తెలుసా.. రివ్యూ రిపోర్ట్

శుక్రవారం, 5 మే 2023 (12:53 IST)
లక్ష్యం, శౌర్యం, తర్వాత దర్శకుడు శ్రీవాస్, గోపీచంద్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా. ఈరోజే విడుదల అయింది. ఎలా ఉందో చూద్దాం.
 
కథ: 
హైదరాబాద్‌లో శుకీభవా అనే పేరుతో ఆర్గానిక్ ఫుడ్‌తో హోటల్ రన్ చేస్తుంటాడు జగపతి బాబు. తమ్ముడు గోపీచంద్ చిన్నతనం నుంచి తప్పును వ్యతిరేకించే రకం. మోసానికి మోసం కాన్సెప్ట్ అతనిది. పోటీగా నాజర్ హోటల్ పెట్టి శుకీభవ హోటల్ వల్ల తన వ్యాపారానికి లాస్ అని జగపతిబాబు‌కు వార్నిగ్ ఇచ్చి హోటల్ మోసేయమంటాడు. ఇది తెలిసి గోపీచంద్, నాజర్‌కు ఎదురు తిరుగుతాడు. నాజర్ పోలీస్ కేసు పెడతాడు. అప్పుడు భయపడి ఇంటి నుంచి పారిపోయి కలకత్తా చేరతాడు. అక్కడ డాన్‌లా ఎదుగుతాడు. ఆ టైమ్‌లో డింపుల్‌ హయాతి ను ప్రేమిస్తాడు. మంచి కుటుంబానికి మా అమ్మాయిని ఇవ్వాలి అనేది రూల్‌గా డింపుల్ తండ్రి గోపీచంద్‌కు చెపుతాడు. కుటుంబం కోసం తిరిగి 14 ఏళ్ల తర్వాత గోపి హైదరాబాద్ వస్తాడు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది సినిమా. 
 
విశ్లేషణ
ఈ కథతో తెలుగులో పలు సినిమాలు వచ్చాయి. ఫుడ్ కోసం, ప్రజల ఆరోగ్యం కోసం తీసిన సినిమా ఇది. ప్రజలకు ఉచిత విద్య, వైద్యం కన్టే కల్తీ లేని ఫుడ్డు ఇవ్వటమే ప్రభుత్వ కర్తవ్యం అంటూ చెప్పే ప్రయత్నం చేశాడు. ఇందులో హైదరాబాదు నుంచి కోల్కత్తా వెళ్లడం అనేది రొటీన్. ఇందులో గోపీచంద్ బాగానే నటించాడు.
 
డింపుల్ హీరోయిన్‌గా కజువల్గా నటించింది. చాలా కాలం తర్వాత కుష్బూ చూడటానికి కుష్బూ బాగుంది. ఇక నాజర్ అలాగే మిగతా నటీనటులందరూ వారి పరిధి మేరకు నటించారు. మొత్తంగా పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి. అయితే రొటీన్‌గా వస్తున్న సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంది. ప్రజల ఆరోగ్యం పరిరక్షణ దిశగా వెళ్లాలి అనే ఒక సందేశాన్ని ఇందులో దర్శకుడు ఇచ్చాడు. పాటలు, సంగీతం పర్వాలేదు. కెమెరా ఒక్. ఇది ప్రేక్షకులు ఆశీస్సులు చూడాల్సింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు