చంద్రప్రభ వాహనంపై గోవిందుడు... సుఖమయ జీవితం ప్రాప్తి

మంగళవారం, 25 సెప్టెంబరు 2012 (13:38 IST)
బ్రహ్మోత్సవాల్లో ఏడవరోజు రాత్రి శ్రీవారు చంద్రప్రభ వాహనంపై దివ్యమంగళ స్వరూపునిగా భక్తులకు దర్శనమిచ్చారు. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయన్నది మనకు తెలిసిందే. చంద్రోదయ వేళ సాగరుడు నురగలు కక్కుతో ఉవ్వెత్తున అలలతో సంతోషంతో ఉప్పొంగుతాడు. చంద్రుని దర్శనం వలన మనసు నిర్మలంగా, ఉల్లాసంగా ఉంటుంది. అందుకే తిరుమలేశుడు తన భక్తులకు చల్లని చంద్రప్రభవాహనంపై సుఖసంతోషాలను కల్గించేందుకు దర్శనమిస్తాడు.

వడ్డీకాసులవాడు వసూళ్లన్నీ భక్తులకే
శ్రీ వేంకటేశ్వరుని వడ్డీకాసుల వాడంటారు. ఆయనకు ప్రతినిత్యం ఆదాయమే. ధన, వస్తు, కనక రూపాలలో కానుకలు ముడుతూనే వుంటాయి. అయినా ఆయన ఆదాయానికి అంతం కనిపించదు. తన వివాహం సందర్భంగా కుబేరుడి దగ్గర చేసిన అప్పులకు వడ్డీగా చేల్లిస్తునే వుంటాడు ఆ స్వామి అని, కలియుగాంతం వరకూ అలా చెల్లిస్తూనే వుండాలని, అందుకే భక్తులు ఆయన్ని వడ్డీ కాసులవాడంటారని చెప్పుకుంటారు.

కాని నిజానికి శ్రీ వేంకటేశ్వరుని ఆదాయమంతా తిరిగి భక్తులకే ఇవ్వబడుతోంది. ఆయన దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదానం, ఉచిత బస్సు వంటి అనేక సౌకర్యాలు దేవస్థానం కల్పిస్తున్నది. పలురకాల కాటేజ్‌లు, గెస్ట్‌హౌస్‌లు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇవికాక విద్య, ధార్మిక అంశాలకు, ధర్మ ప్రచారానికి, వేదవిద్యకు, సంస్కృత అధ్యయనానికి, వైద్యానికి ఇలా ఒకటేమిటి సమస్త సౌకర్యాలకు దేవస్థానం ధనమే వాడుతుంటారు.
WD

వెబ్దునియా పై చదవండి