సూర్యప్రభ వాహనంపై తిరుమలేశుడు... శ్రీవారి లడ్డూలు ప్రీతికరం

సోమవారం, 24 సెప్టెంబరు 2012 (14:42 IST)
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన సోమవారం ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. సప్తాశ్వాలపై భానుడు రథసారధిగా ఎర్రటి పూలమాలలు ధరించి స్వామి ఈ వాహనం మీద ఊరేగారు. ప్రపంచానికి వెలుగు ప్రసాదించే సూర్య భగవానుడికి తానే ప్రతిరూపమని చాటి చెప్పేలా ఈ వాహన సేవ సాగింది.

అలాగే, ఏడో రోజు రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీమలయప్ప స్వామి ఊరేగుతారు. ఏడోరోజు రాత్రి తెల్లటి వస్త్రాలు, పూల మాలలు ధరించి స్వామి చంద్రప్రభ వాహనంపై విహరిస్తారు. సూర్యుడి తీక్షణం, చంద్రుని శీతలత్వం రెండూ తన అంశలేనని ఈ వాహనాల ద్వారా తెలియజేస్తారు.

శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రం తిరుమల లడ్డు
తిరుపతి వెళ్ళి స్వామి వారి దర్శనం తర్వాత ఆత్రుతగా అందుకోవాలనుకునే ప్రసాదం లడ్డు, ఇతర ప్రసాదాలుగా వడ, దద్దోజనం, బియ్యప్పొంగలి వంటివి ఎన్ని తీసుకున్నా లడ్డూను ప్రసాదంగా తీసుకుంటేగాని తృప్తి కలుగదు. తిరుమల నుండి వచ్చిన భక్తులు తమ బంధుమిత్రులుకు తప్పనిసరిగా పంచే ప్రసాదం లడ్డు.

స్వామివారికి సమర్పించి, ప్రసాదంగా పంచేందుకు చిన్న లడ్డూలు, పెద్ద లడ్డూలు తయారు చేస్తారు. ఇందుకోసం రోజుకు 4000 కిలోల శనగపిండి, 18,500 కిలోల నెయ్యి, 900 కిలోల పంచదార, 2000 కిలోల జీడిపప్పు, 150 కిలోల యాలకులు, 300 కిలోల కలకండ, 600 కిలోల ఎండు ద్రాక్ష వినియోగిస్తారు.

రోజుకు 55 వేల చిన్న లడ్డూలు, 7000 పెద్ద లడ్డూలు తయారవుతాయి. ఏడాది తిరిగేసరికి 25 లక్షల 55 వేల పెద్ద లడ్డూలు, 2 కోట్ల 75 వేల చిన్న లడ్డూలు ప్రసాదంగా పంపిణీ అవుతున్నాయి. తిరుపతి లడ్డూలను భక్తితో కాకలపోయినా రుచికోసం తినే నాస్తికులు కూడా వున్నారు.
WD

మధురమైన లడ్డూల తయారీ ఒక కళ. ఆ కళను సొంతం చేసుకున్నది తిరుమలలోని ఒక అయ్యంగార్ల కుటుంబం. అదివారికి వంశపారంపర్యంగా వచ్చిన కళ. స్వామివారికి లడ్డూలు యాంత్రికంగా చేయలేం, ఆధ్యాత్మిక చింతనతో, భక్తిభావంతో చెయ్యాల్సి ఉంటుంది. ఆ భక్తి భావమే తమ కుటుంబాన్ని లడ్డూలతయారీకి అంకితం చేసిందంటారు ఆ కుటుంబ సభ్యులు.

వెబ్దునియా పై చదవండి