సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో నెటిజన్లను భయపెడుతోంది. ఇద్దరు చిన్నారుల మెడలో పువ్వుల మాల వేసి వారిపై మరుగుతున్న పాలను పోస్తున్నారు. ఈ ఘటన ఆలయాల్లో జరిగే ఏదో ఆచారంలా తెలుస్తోంది. వేడి వేడిగా పొయ్యిపై మరుగుతున్న పాలను చిన్నారుల పోస్తున్నాడు ఓ వ్యక్తి.
ఆ వేడికి చిన్నారులు తణకలాడిపోతున్నారు. ఇద్దరు పిల్లలపై మరుగుతున్న పాలు పోసిన ఆ వ్యక్తి.. మరో చిన్నారిని చేత్తో పట్టుకుని మరో కుండ పాలును పోస్తున్నాడు. ఆ వేడికి తాళలేక ఆ బిడ్డ గిలగిలలాడిపోతుంది.
ఈ వీడియో చూసిన వారంతా వామ్మో ఇదెక్కడి ఆచారం అంటా నానా రకాలుగా తిట్టిపోస్తున్నారు. ఇంకా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
చూస్తే మరుగుతున్న వేడి పాలు అనిపిస్తుంది,
పసి పిల్లలపై అలా పోస్తున్నారు ఏంటి ???????? pic.twitter.com/mDzy2jdsMw