50 అడుగుల ఎత్తులో సరసాలు.. ముద్దులు, కౌగిలింతలు.. చివరికి ఆ ప్రేమజంట?

మంగళవారం, 13 ఆగస్టు 2019 (16:02 IST)
ప్రేమికుల మైకం ప్రాణాలు తీసింది. ప్రేమ మైకంలో ఓ జంట ఏం చేస్తున్నారో తెలియక ముద్దుల్లో మునిగిపోయింది. 50 అడుగుల ఎత్తైన ఓ వంతెన రైలింగ్‌పై నిలబడి ప్రపంచాన్ని మరిచిపోయిన ఆ జంట రొమాన్సులే మునిగిపోయింది. 
 
కానీ ఆ ప్రేమ జంట సరసాల్లో మునిగితేలుతుండగా.. ప్రమాదవశాత్తు ఇద్దరూ కిందపడిపోయారు. దీంతో తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఈ ఘటన సౌత్ అమెరికాలోని పెరూ పరిధిలో ఉన్న కుస్కోలో  చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళ్తే.. మేబెత్ ఎస్పినోజ్(34), హెక్టర్ విడల్ (36) వీరిద్దరూ స్థానికంగా టూరిస్ట్ గైడ్స్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. ఇటీవల కుస్కోలోని ఓ నైట్ క్లబ్‌కి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో ఉన్న బెత్లెహామ్ బ్రిడ్జిపై ఆగారు. ఆ సమయంలో బ్రిడ్జిపై ఎవరూ లేకపోవడంతో.. రైలింగ్ వద్దకు వెళ్లి ఇద్దరూ ముద్దులు, కౌగిలింతల్లో మునిగిపోయారు.
 
అయితే సరసాల్లో పడి అదుపు తప్పి కిందపడ్డారు. ఆస్పత్రికి తరలించినా.. తలకు తీవ్ర గాయం కావడంతో అప్పటికే ఎస్పినోజ్ మృతి చెందాడు. ఆ తర్వాత చికిత్స పొందుతూ విడల్ కూడా మృతి చెందింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు