తల్లీబిడ్డను మైనస్ 13 డిగ్రీల వాతావరణంలో తరలించినందుకు మంగోలియా ప్రధాని రాజీనామా

శుక్రవారం, 22 జనవరి 2021 (14:23 IST)
మంగోలియా దేశంలో కోవిడ్ సోకిన ఓ నిండు గర్భిణి శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత ఆమెను, ఆ నవజాత శిశువును కరోనా ఆస్పత్రికి తరలించారు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే బిడ్డతో సహా ఆమెను చికిత్సకు తరలించిన విధానంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
మైనస్ 13 డిగ్రీల వాతావరణంలో కేవలం పైజామా ధరించి ఉన్న సమయంలో అలా తరలించడాన్ని నిరసిస్తూ వేలాది మంది రాజధాని ఉలాన్‌బాతర్‌‌లో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మంగోలియా ప్రధాన మంత్రి ఖురేల్‌సుఖ్ ఉఖ్నా రాజీనామా చేశారు.
ఆసుపత్రి చీఫ్ కూడా నిష్క్రమించారు. రష్యా, చైనా సరిహద్దుల్లో మంగోలియా దేశం ఉంది. ఒకప్పుడు హిందూ సామ్రాజ్యంలో భాగమైన మంగోలియాలో సగానికి పైగా ప్రజలు బౌద్ధ మతాన్ని అనుసరిస్తున్నారు. ముస్లింలు, క్రైస్తవుల జనాభా ఐదు శాతం కన్నా తక్కువ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు