40 యేళ్ళ క్రితమే కరోనా వైరస్... ది ఐస్ ఆఫ్ డార్క్‌నెస్ పుస్తకంలో...

సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (19:40 IST)
చైనా దేశాన్ని కబళించిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే 1700 మంది ప్రాణాలు తీసిన ఈ వైరస్... వుహాన్ నగరం కేంద్ర బిందువుగా ఉన్న విషయం తెల్సిందే. ఈ వైరస్ ప్రస్తుతం 25 దేశాల్లో విస్తరించింది. అయితే, ఈ వైరస్ గురించి ఓ ఆసక్తికరమైన అంశమొకటి వెలుగులోకివచ్చింది. దాదాపు 40 యేళ్ళ క్రితమే ఓ రచయిత ఫిక్సన్ నవలలో ఈ వైరస్ గురించి ప్రస్తావించినట్టు తాజాగా వెల్లడైంది. ఆ పుస్తకం పేరు ది ఐస్ ఆఫ్ డార్క్‌నెస్. 
 
ఇందులో ఈ వైరస్ గురించి నవలా రచయిత డీన్ కుంట్జ్ 1981లోనే ప్రస్తావించివుండటం గమనార్హం. అపుడు ఈ వైరస్‌‌ను వుహాన్-400గా పిలిచారు. దీనికి సంబంధించిన ఓ పోస్ట్‌ను ట్విట్టర్‌లో వైరల్ అయింది. ఇందులో నవల పేరుతో పాటు అందులో పేర్కొన్న అంశాలతో పాటు వైరస్ గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా, ఈ వైరస్‌ వ్యాప్తి, ప్రభావంతో పాటు.. వైరస్ లక్షణాలను ఇందులో ప్రస్తావించడం గమనార్హం. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ కాగా, దీనిపై అనేక మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. 
 
కరోనా మృతులు 1700 
మరోవైపు, కరోనా వైరస్ దెబ్బకు చైనా కకావికలమైపోతోంది. ఈ వైరస్ రోజురోజుకూ మరింతగా విస్తరిస్తోంది. ఫలితంగా మృతుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతంది. ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 1770కు చేరింది. హుబే ప్రావిన్స్‌లో ఒక్క రోజులోనే 100 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
అదేసమయంలో చైనాలో కొత్తగా 2018 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కోవిద్‌-19 వైరస్‌ బాధితుల సంఖ్య 70,548కి చేరింది. ఈ వ్యాధితో ఆస్పత్రుల్లో చేరికోలుకున్న తర్వాత 10,844 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ వ్యాధిని అరికట్టేందుకు చైనా అధికారులు బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు విధించారు. 
 
మరోవైపు, పాన్‌ తీరంలో నిలిపేసిన 'డైమండ్‌ ప్రిన్సెస్' నౌకలో కోవిడ్-19 సోకిన వారి సంఖ్య ఆదివారానికి 355కి పెరిగింది. అందులోభారత్‌ సహా 50 దేశాలకు చెందిన 3700 మంది ఉన్నారు. ఆ నౌకలో నుంచి తమ వారిని తీసుకువెళ్లేందుకు అమెరికా, కెనడా సహా పలు దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి.

 

It's a strange world we live in.#coronavirus #COVID19 #Wuhan pic.twitter.com/WkjbK4zGaW

— Darren of Plymouth

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు