డైమండ్ ప్రిన్స్ నౌకలోని కరోనా వైరస్ బాధితులకు యాపిల్ ఐఫోన్లు.. ఎందుకు? (Video)

సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (14:57 IST)
జపాన్‌కు చెందిన పర్యాటక నౌక డైమండ్ ప్రిన్సెస్ నౌకలో కరోనా వైరస్ బారినపడిన 3700 మంది బాధితులకు యాపిల్ ఐఫోన్లను పంపిణీ చేశారు. ఇదే విషయంపై ఎన్డీటీవీ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ నౌకలో ఉన్న కరోనా వైరస్ బాధితుల్లో భారతీయులు కూడా ఉన్నారు. ఈ బాధితుల్లో రెండు వేల మందికి యాపిల్ ఐఫోన్లను అందచేశారు. 
 
వైద్య నిపుణులతో సంప్రదింపులు జరిపేందుకు, అపాయింట్మెంట్లను బుక్ చేసుకునేందుకు, మందుల వాడకం, ఇతర అంశాలపై వైద్యులతో మాట్లాడేందుకు వీలుగా ఈ ఫోన్లను పంపిణీ చేశారు. కాగా, ఈ నౌకలో ఉన్నవారిలో దాదాపు 350 మందికి ఈ వైరస్ సోకినట్టు వైద్య పరీక్షల్లో తేలిన విషయం తెల్సిందే.
 
మరోవైపు, కరోనా వైరస్ దెబ్బకు చైనా కకావికలమైపోతోంది. ఈ వైరస్ రోజురోజుకూ మరింతగా విస్తరిస్తోంది. ఫలితంగా మృతుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతంది. ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 1770కు చేరింది. హుబే ప్రావిన్స్‌లో ఒక్క రోజులోనే 100 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
అదేసమయంలో చైనాలో కొత్తగా 2018 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కోవిద్‌-19 వైరస్‌ బాధితుల సంఖ్య 70,548కి చేరింది. ఈ వ్యాధితో ఆస్పత్రుల్లో చేరికోలుకున్న తర్వాత 10,844 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ వ్యాధిని అరికట్టేందుకు చైనా అధికారులు బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు విధించారు. 
 
మరోవైపు, పాన్‌ తీరంలో నిలిపేసిన 'డైమండ్‌ ప్రిన్సెస్' నౌకలో కోవిడ్-19 సోకిన వారి సంఖ్య ఆదివారానికి 355కి పెరిగింది. అందులోభారత్‌ సహా 50 దేశాలకు చెందిన 3700 మంది ఉన్నారు. ఆ నౌకలో నుంచి తమ వారిని తీసుకువెళ్లేందుకు అమెరికా, కెనడా సహా పలు దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి.

 

今回、#ダイヤモンドプリンセス号 の乗客の皆様へ、厚労省、SB社、LINE社の連携の下、LINEを入れたiPhoneを2000台をご提供させていただきました

LINE経由での乗客への情報を提供を実現し、さらに心理カウンセラー、医師へのオンライン相談が可能となりました

※写真は有志たち#新型コロナウィルス pic.twitter.com/o9n8o9WSix

— 舛田 淳(Masuda Jun)/LINE (@masujun) February 14, 2020
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు