పిచ్చి పీక్స్‌కి, అర్థనగ్నంగా వెడ్డింగ్ షూట్.. ఎక్కడ?

మంగళవారం, 20 అక్టోబరు 2020 (15:56 IST)
ఫోటో కర్టెసీ-సోషల్ మీడియా
భారతదేశ సంస్కృతిని మిగిలిన దేశాలు కొనియాడుతుంటాయి. హిందూ సమాజంలో జరిగే పెళ్ళిళ్ళు చరిత్రలో మిగిలిపోతుంటాయి అంటారు. కానీ అలాంటి సంస్కృతికి తూట్లు పొడిచేట్లు కొంతమంది ప్రవర్తిస్తున్నారు. తిరువనంతపురంలో జరిగిన ఒక వెడ్డింగ్ షూట్ కాస్త పెద్ద చర్చే నడుస్తోంది. 
 
రిషి కార్తికేయన్, లక్ష్మి. కరోనా సమయం కావడంతో తక్కువ మందితో వివాహానికి ప్లాన్ చేశారు. బంధువులతో కలిసి కలివిడిగా ఎంజాయ్ చేస్తూ వివాహం చేసుకోవాలన్నది వీరిద్దరి ఆలోచన. కానీ కరోనా కారణంగా పరిమిత సంఖ్యలోనే వివాహానికి రావాల్సి వచ్చింది.
 
ఈ వివాహం ఈ మధ్యనే జరిగింది. కానీ ఏదో వెరైటీ చేయాలన్న ఉద్దేశంతో వెడ్డింగ్ షూట్‌కు ప్లాన్ చేశారు. రిషి కార్తికేయన్ తన స్నేహితుడైన ఒక ఫోటోగ్రాఫర్‌తో అర్థనగ్న ఫోటో షూట్‌లకు ప్లాన్ చేద్దామని చెప్పాడు. ఇంతకీ ఈ ఆలోచన మొత్తం పెళ్ళి కూతురిదే.
 
అయితే పెళ్ళికొడుకు మొదట ఆలోచించాడు కానీ.. పెళ్ళి కూతురే చెబితే ఇక సైలెంట్‌గా ఉంటాడా. అతను కూడా ఒకే అనేశాడు. మరీ ఇంత అన్యాయంగా వెడ్డింగ్ ఫోటో షూట్లు తీసిన దాఖలాలు ఎక్కడా.. ఎప్పుడూ..లేదు. అంతేకాదు ఈ ఫోటో షూట్లను ఏకంగా తమ ఫ్రెండ్స్‌కు సామాజిక మాథ్యమాల ద్వారా పోస్టులు కూడా చేసేస్తున్నారు వీరిద్దరు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు