కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్సభలో ప్రవేశపెడుతున్న వార్షిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు రెండు యూనివర్శిటీలను కేటాయించారు. వీటిలో ఏపీకు వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణకు హార్టీకల్చర్ విశ్వవిద్యాలయం కేటాయిస్తున్నట్లు మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ aప్రసంగంలో ప్రకటించారు.
అలాగే, ఆంధ్రప్రదేశ్లో ఎయిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్టు లోక్సభలో సాధారణ బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. దీని కోసం రూ.500 కోట్ల కేటాయిస్తున్నట్టు తెలిపారు. అయితే, పశ్చిమ బెంగాల్, విదర్భ, పూర్వాంచల్లో కూడా ఎయిమ్స్కు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దశల వారీగా అన్ని రాష్ట్రాల్లో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఏపీలో ఐఐటీ ప్రతిపాదన కూడా ఉందని చెప్పారు.