ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ వల్ల ఇక దేశంలో ఆర్థిక మందగమనం తప్పదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఈ బడ్జెట్పై ఆయన స్పందిస్తూ అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2014-15 బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థ వేగాన్ని తగ్గించేలా ఉండటంతో దేశం ఆర్థిక మందగమన దిశగా పయనించే ప్రమాదం ఉందని విమర్శించారు.