ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. కృష్ణాపట్నంలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.
దీంతో పాటు ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పనున్న ఎయిమ్స్కు కేంద్ర బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించారు. విశాఖ - చెన్నై మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్లో ఐఐటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రూ.200 కోట్లతో ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు.