కావలసిన పదార్ధాలు... పనీర్ : 250 గ్రా. కాప్సికమ్ : 200 గ్రా. ఉల్లిపాయలు: 200 గ్రా. పచ్చి మిర్చి : 4 టొమాటోలు: 2 అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయల పేస్ట్ : సరిపడ టొమాటో, సోయా, చిల్లీ సాస్ : 2 టేబుల్ స్పూన్లు మిరియాల పొడి : 1/2 టీ స్పూన్ నీళ్ళు : 1/2 కప్పు నూనె : 2 కప్పులు ఉప్పు : తగినంత
తయారు చేసే విధానం... ముందుగా కాప్సికమ్ను, ఉల్లిపాయలను సన్నగా ముక్కలుగా తరుక్కుని పెట్టుకోవాలి. సిద్ధం చేసుకున్న పనీర్ను మనకు కావాల్సిన సైజుల్లో కత్తిరించి పెట్టుకోవాలి. పచ్చి మిరపకాయలు, టొమాటోలను చిన్న ముక్కలుగా చేసి పక్కకు పెట్టుకోవాలి. మరోవైపు పొయ్యి మీద బాణలి పెట్టి అందులో నూనె పోసి కాప్సికమ్, పనీర్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటోలు ఒక దాని తర్వాత చిటికెడు ఉప్పు వేస్తూ వేసి వేయించి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి.
నూనెను మళ్లీ వేడి చేసి, దానిలో ఉల్లిపాయ పేస్ట్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా రెండు నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత టొమాటో సాస్ వేసి మరో రెండు నిమిషాలు, పిమ్మట కారం, మిరియాల పొడి వేసి ఒక అర నిమిషం వేగనివ్వాలి. అందులోనే చిల్లీ సాస్, సోయాసాస్ వేసి కొద్దిసేపు వేయించాలి.
తర్వాత తరిగి పెట్టుకున్న మిరపకాయలు వేసి ఒక నిమిషం తర్వాత కాప్సికమ్, పనీర్, ఉల్లిపాయ ముక్కలు వేసి నీళ్ళు పోసి మూత పెట్టి ఐదు నుంచి నిమిషాలు ఉడికించాలి. తర్వాత మూత తీసి ఒక నిమిషం ఉంచి దించేయాలి. అంతే... చిల్లీ పనీర్ సిద్ధమైనట్టే.