చిల్లీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాన్సర్ చెక్ పెట్టే చిల్లీతో పాటు డెంటల్ కేర్, ఎముకలకు బలాన్నిచ్చే ఛీజ్తో కలిసి దోసె తయారు చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేసి చూడండి.
కావాల్సిన పదార్థాలు : రెండు టేబుల్ స్పూన్ల ఛీజ్ తురుము, ఒక టేబుల్ స్పూన్ పచ్చి మిరపకాయ ముక్కలు, ఒక టీ స్పూన్ కొత్తిమీర.
తయారీ విధానం : ఛీజ్, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర కలిపి ఫిల్లింగ్ మిశ్రమం తయారు చేసుకోవాలి. దోసెపిండిలో పచ్చిబియ్యానికి బదులు ఒక కప్పు రవ్వ కలపి.. రవ్వదోసె పిండి తయారు చేసుకోవాలి. పైనంపై దోసెవేశాక ఓ వైపు కాలనిచ్చి, రెండో వైపునకు తిప్పి నడుమ ఛీజ్ మిశ్రమం వుంచి దోసెను చుట్టాలి. కొబ్బరి చట్నీతో తింటే రుచిగా వుంటాయి.