తయారుచేయండి ఇలా:
మొదట మిక్సీ జార్ లో టమోటాలు, జీడిపప్పు, అల్లం, పచ్చి మిరప కాయ వేసి ఒక నిముషం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సాస్ పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర వేసి ఒక నిముషం వేగించాలి.
తర్వాత అందులో చిటికెడు ఇంగువ, జీలకర్ర వేసి మిక్సీలో పేస్ట్ చేసుకొన్న మిశ్రమాన్ని వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి. అనంతరం అందులోనే ధనియాల పొడి, కారం, పసుపు, మరియు ఉప్పు కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలుపుతూ ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి.