గరం మసాలా పొడి- 1/2 టీ స్పూన్
కొబ్బరి పొడి - 2 టీస్పూన్లు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్లు
ముందుగా మష్రూమ్స్ ముక్కలను, పనీర్ను తురుముని పక్కనబెట్టుకోవాలి. స్టౌ మీద బాణలిని వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపా య ముక్కలను వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి. అందులో పచ్చి మిర్చి, మష్రూమ్స్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత తురిమి పెట్టుకున్న పనీర్ వేసి కలపాలి. పనీర్ కరిగిన తర్వాత అందులో ధనియాల పొడి, కొబ్బరి పొడి, ఉప్పు, గరం మసాలా పొడి వేసి కలియతిప్పాలి. పదార్ధాలన్నీ వేగిన తర్వాత దించి కొత్తిమీరతో అలంకరించి రోటీలకు.. రైస్తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.