మహిళలు బరువు తగ్గాలంటే.. తాటి ముంజలు, వెల్లుల్లి రెబ్బలు

సోమవారం, 19 జూన్ 2023 (11:38 IST)
మహిళలు బరువు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే. అల్లం రసాన్ని మరిగించి అందులో అంతే మోతాదులో తేనె పోసి చల్లారిన తర్వాత రోజూ భోజనం చేసిన తర్వాత తింటే శరీరం ఉబ్బరం త్వరగా తగ్గుతుంది. ఉసిరి ఆకు రసాన్ని రోజూ ఉదయం, సాయంత్రం 2 చెంచాల చొప్పున తీసుకుంటే బరువు తగ్గుతారు.
 
తాటి ముంజలతో పాటు 5 వెల్లుల్లి రెబ్బలు తింటే స్థూలకాయం, పొట్ట కొవ్వు, కొవ్వు కణితులు తగ్గుతాయి. కుండ పొట్ట ఉన్నవారు అరటి కాండం రసాన్ని తీసుకుని రోజూ తాగుతూ ఉంటే రోజు తర్వాత పొట్ట తగ్గుతుంది. వారానికి రెండు సార్లు సొరకాయను వండుకుని తింటే పొట్ట తగ్గుతుంది.
 
పొన్నగంటి కూరను ఆహారంలో తరచుగా తీసుకోవడం ద్వారా ఒబిసిటీ దూరం అవుతుంది. బొప్పాయిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఊబకాయం తగ్గుతుంది.
 
గరిక జ్యూస్ లేదా గుమ్మడికాయ రసం తాగడం వల్ల ఆటోమేటిక్‌గా శరీర బరువు తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు