లిక్కర్ కింగ్, ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్టు చేశారు. భారత్ ఒత్తిడి మేరకు ఆయనన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను లండన్లోని వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరిచి.. ఆ తర్వాత భారత్కు తరలించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు మాల్యాకు వ్యతిరేకంగా బ్యాంకుల కన్సార్టియం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మాల్యా తన పూర్తి ఆస్తుల వివరాలను వెల్లడించాలని పిటిషన్ వేసింది. అయితే దీనిపై కూడా మాల్యా స్పందించకపోవడంతో ఇటీవలే ఢిల్లీ హైకోర్టు ఆయనపై ఓపెన్ ఎండెడ్ నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం మాల్యాను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్టు చేశారు.