వెస్టిండీస్ గడ్డపై జరిగే ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచ కప్ షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. ఈ టోర్నీలో పాల్గొనే 12 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఈనెల 30వ తేదీ నుంచి గ్రూపు మ్యాచ్లు ప్రారంభమవుతాయి. తొలి మ్యాచ్ న్యూజిలాండ్-శ్రీలంక, వెస్టిండీస్-ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతుంది. మే ఒకటో తేదీన ఆప్ఘనిస్థాన్-భారత్, బంగ్లాదేశ్-పాకిస్థాన్ జట్లు తలపడతాయి.
కాగా, గ్రూపు ఏలో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, గ్రూపు బిలో శ్రీలంక, న్యూజిలాండ్, జింబాబ్వే, గ్రూపు సిలో దక్షిణాఫ్రికా, భారత్, ఆప్ఘనిస్థాన్, గ్రూపు డిలో వెస్టిండీస్ ఇంగ్లండ్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. ఈ టోర్నీ వివరాలు ఇలా ఉన్నాయి.
ఏప్రిల్ 30వ తేదీ న్యూజిలాండ్ x శ్రీలంక, వెస్టిండీస్ x ఐర్లాండ్, మే 1వ తేదీ ఆఫ్ఘనిస్థాన్ x భారత్, బంగ్లాదేశ్ x పాకిస్థాన్, మే 2వ తేదీ భారత్ x దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా x పాకిస్థాన్, మే 3వ తేదీ శ్రీలంక x జింబాబ్వే, వెస్టిండీస్ x ఇంగ్లండ్, మే 4వ తేదీ న్యూజిలాండ్ x జింబాబ్వే, ఇంగ్లండ్ x ఐర్లాండ్, మే 5వ తేదీ ఆస్ట్రేలియా x బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ xదక్షిణాఫ్రికా జట్ల తలపడతాయి.
గ్రూపు మ్యాచ్లు ముగిసిన తర్వాత సూపర్ ఎయిట్ దశ మ్యాచ్లు జరుగుతాయి. ఇందులో తొలి మ్యాచ్ మే ఆరో తేదీన జరుగుతుంది. మే 6న ఎ1xడి2; సి1xబి2, మే 7న ఎ2xసి2; బి1xడి1, మే 8న సి1xడి2; ఎ1xబి2, మే 9న సి2xడి1; బి1xఎ2, మే 10న బి2xడి2; ఎ1xసి1, మే 11న బి1xసి2; డి1xఎ2న జరుగుతాయి. మే 13వ తేదీన తొలి సెమీస్, 14న రెండో సెమీస్, మే 16వ తేదీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.