మెగా హీరో సాయిధరమ్ తేజ్ని హీరోగా పరిచయం చేస్తూ 'రేయ్' సినిమాను తెరకెక్కించారు వైవీఎస్ చౌదరి. అసలు ఈ సినిమాని ఏ ముహూర్తాన ప్రారంభించారో గానీ, అన్నీ అడ్డంకులే వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్కు కూడా చాలా సయమం పట్టింది. వరుస వాయిదాలు వేస్తూ తాజాగా దీన్ని మే9న రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఈ సినిమాకి ఇపుడు మరో అడ్డంగి వచ్చింది. అదే రోజున రజనీకాంత్ నటించిన 'విక్రమసింహా' భారీగా రిలీజ్ అవుతోంది. రజనీకాంత్ అంటే ఓపెనింగ్స్ వుంటాయి. అందులోనూ ఇది కొత్తతరహా టెక్నాలజీతో నిర్మించారనడంతో మరింతగా క్రేజ్ వుంది. ఇప్పటికే రాష్ట్రంలో మంచి థియేటర్లు చాలా వరకు ఆ సినిమాకి బుక్ చేసేశారట. ఈ నేపథ్యంలో మరి, కొత్త మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రేక్షకుల్ని ఎలా రాబట్టుకుంటాడో, చౌదరి ఎలా గట్టెక్కుతాడో చూడాలి!