మనిషికి ఆవేశం వుండడం సహజం. కానీ అది పబ్లిక్గా పదిమంది ముందు వ్యక్తం చేయడం చాలా నష్టాన్ని కల్గిస్తుంది. నాకూ ఆవేశముందని, స్టేజీపై బాలయ్యబాబుకూడా వున్నాడనీ, మరీ రచ్చ చేయడం ఎందుకని అణచుకున్నాని లెజెండ్ దర్శకుడు బోయపాటి శ్రీను తెలియజేశారు.
ఆమధ్య లెజెండ్ సక్సెస్మీట్లో పాల్గొన్న మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ రీరికార్డింగ్ గురించి దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ... రాత్రిల్ళు దగ్గరుండి పనిచేయించుకున్నానంటే.. వెంటనే మైక్ లాక్కుని దేవీశ్రీప్రసాద్.. ఒకరు చెబితే వినే దౌర్భాగ్యం నాకు లేదంటూ, అసలు దర్శకుడు లాప్టాప్ తీసుకుని ఇంగ్లీషు సినిమాలు చూస్తూ కూర్చున్నాడు. అంటూ ఎద్దేవా చేసినట్లు మాట్లాడాడు.
దీంతో స్టేజీపై వున్న బోయపాటి శ్రీనుకు ఎక్కడో కాలింది. కానీ ఇది టైంకాదు, ఇంకా ఈ విషయాన్ని పెద్దది చేయడం భావ్యంకాదని అవసరం వచ్చినప్పుడు చెబుతామని ఊరుకున్నాడట. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం.