కౌటిల్య, ప్రభాకర్, మధు, అనిల్, ప్రవీణ్బాబు ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం "రూ. 999 మాత్రమే". నలుగురు కుర్రాళ్ళ చుట్టూ తిరిగే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. నెవర్ 9 క్రియేటర్స్ పతాకంపై గోవింద్ నవీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా మహేందర్ దర్శకత్వం వహిస్తున్నారు.
తెలుగు చలనచిత్ర పరిరక్షణ సమితి సారధ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా చక్కటి సస్పెన్స్ చిత్రమిదని నిర్మాత అన్నారు. పలువురు సీనియర్ ఆర్టిస్టులు కూడా ఇందులో నటించారని ఆయన చెప్పారు.
దర్శకుడు మహేందర్ మాట్లాడుతూ, విభిన్నమైన కథాచిత్రమిదని తెలిపారు. అందరిని చదువుకోమని ప్రోత్సహించే ప్రభుత్వం ఆ తరువాత ఏం చేస్తోందన్న అంశాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించామని తెలిపారు.
ఇందులో ఓ ప్రముఖ హీరో నటించారని, అతను ఎవరన్నది సినిమా చూసి తెలుసుకోవలసిందేనని దర్శకుడు పేర్కొన్నారు. బ్రహ్మానందం, జయప్రకాష్రెడ్డి, కృష్ణభగవాన్ల హాస్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.