కావలసిన పదార్థాలు : బియ్యంపిండి... రెండు కప్పులు మంచినీరు... నాలుగు కప్పులు పచ్చిమిర్చి... ఎనిమిది ఉప్పు... తగినంత జీలకర్ర... కొద్దిగా నువ్వుపప్పులు... నాలుగు టీ.
తయారీ విధానం : మందపాటి గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి, స్టవ్మీద పెట్టాలి. బియ్యప్పిండిలో రెండుకప్పుల చల్లటి నీళ్లు పోసి బాగా కలిపి పెట్టుకోవాలి. స్టవ్మీద నీళ్లు బాగా మరిగిన తరువాత బియ్యప్పిండిలో నీళ్లను పోసి ఉండలు కట్టకుండా కలుపుతుండాలి. పిండి ఉడికిన తరవాత మెత్తగా దంచిన పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర మిశ్రమాన్ని, నువ్వు పప్పును కూడా అందులో కలపాలి.
చల్లారాక జంతికల గొట్టంలో ఈ పిండి ఉంచి ప్లాస్టిక్ కవర్మీద జంతికల మాదిరిగా కావలసిన సైజులో వత్తి ఎండలో పెట్టాలి. ఇవి బాగా ఎండిన తరువాత జాగ్రత్తగా విరిగిపోకుండా డబ్బాలో భద్రపరచాలి. కావాల్సినప్పుడు నూనెలో వడియాల్లాగా వేయించి తినవచ్చు.