వేసవి కాలం వచ్చేసింది. సూర్యభగవానుడు తన ప్రతాపం చూపించడం ఇప్పటికే ప్రారంభించాడు. మార్చి నెలాఖరు నాటికి దక్షిణ భారతంలో ఎండ తీవ్రత పెరగనుంది. మానవ జీవితం ఈ ఎండ వేడిమిని తట్టుకోలేక శరీరంపై గడ్డలు లేస్తుంటాయ. వాటిని తగ్గించుకొనేందుకు నానా అవస్థలు పడుతుంటారు. వంటిపై చిన్నపాటి గడ్డ లేసిందంటే.. వైద్యుడుని వెతుక్కుంటూ ఆస్పత్రులకు లంఘిస్తుంటారు. ఇలా పరుగులు తీసే ముందు... కాస్త ఆలోచన చేస్తే మన వంటింట్లోనే ఈ గడ్డలకు నివారణోపాయాలు కనుగొనవచ్చు. అలాంటి వాటిలో కొన్ని చిట్కాలను ఇక్కడ పరిశీలిద్ధాం.
ముషిణి గింజలు చూర్ణం చేసి కోడిగుడ్డు తెల్లసొనతో కలిపి గడ్డపై పట్టులాగా వేస్తే గడ్డ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అలాగే, పచ్చ గన్నేరు వేరును మెత్తగా నూరి గంధం ముద్దగా తయారు చేసి దాన్ని ఆ గడ్డలపై వేస్తే ఉపశమనం లభిస్తుంది.
ముఖ్యంగా, తాంబూళంలో వేసుకున్న సున్నపు గుజ్జును మెత్తగా చేసి గడ్డపైన వేసినప్పుడు కూడా ఆ గడ్డలు పగిలి త్వరగా నయమయ్యేందుకు ఆస్కారం ఉంది. అలాగే, కాస్త పసుపు, సున్నం కలిపి ఉడికించి గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఆ గడ్డలపై వేస్తే అవి తగ్గుముఖం పడతాయి.
నువ్వులను మెత్తగా నూరి కొంచెం తేనెతో కలిపి ఉడికించి దానిని పట్టులాగా గడ్డలపై వేస్తే అవి తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా సీతాఫల ఆకులు ఉప్పు కలిపి నూరి గడ్డలపై కడితే ఆ గడ్డలు పగిలి పోయి మాడిపోతాయని గృహ వైద్యులు చెపుతున్నారు.