శ్లేష్మంతో కూడిన విరేచనాలు ముఖ్యంగా వేసవికాలంలోను, అధిక వేడిప్రాంతాల్లో జీవించే మనుషులకు ఎక్కువగా వస్తుంది. ఈ రకం విరేచనాల్లో కడుపునొప్పి ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత, బలహీనత ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. ఆకలి మందగించడం, బరువు తగ్గిపోవడం జరుగుతుంది. శ్లేష్మంతో కూడిన విరేచనాల్నిపట్టించుకోకపోతే లివర్ చెడిపోయే అవకాశం కూడా ఉంది. ఇలాంటి విరేచనాల్నిఅరకట్టడానికి ఈ చికిత్సలు పాటిస్తే సరిపోతుంది.
ఒక కప్పునీటిలో నిమ్మకాయ రసం కలిపి సన్నని మంటపై పది నిమిషాలు మరిగించి రోజుకు రెండు సార్లు త్రాగాలి. ఇలా చేస్తే విరేచనాలు తగ్గుతాయి. ఉల్లిపాయను సన్నగా తరిగి పెరుగుతో కలిపి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకోవాలి.